BREAKING : రెడ్యానాయక్ కుమారుడు రవి చంద్ర నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తండ్రి రెడ్యానాయక్ కు మంత్రి పదవి ఖాయమన్నారు. ఇవాళ రెడ్యానాయక్ తనయుడు రవిచంద్ర నాయక్ మీడియాతో మట్లాడుతూ.. డోర్నకల్ కు రాజకీయ టూరిస్ట్ లు వస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు.
డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ మనుసులో ఉంటేనే పని అవుతుంది.. ఆయన ఆశీస్సులు ఉంటేనే నాయకులు, ప్రజాప్రతినిధులు అవుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో రెడ్యానాయక్ ను గెలిపించి కేసీఆర్ ఆశీస్సులతో రెడ్యానాయక్ ను మంత్రిని చేయడానికి యువతకు సారధిగా నేను ముందు నడుస్తానని ప్రకటించారు. నాన్న వద్దు అనుకున్నప్పుడే నేను మీ..ముందుకు ఎన్నికల బరిలోకి వస్తానని.. అప్పటివరకూ నాకు బరిలో ఉండాలన్న ఆలోచన లేదని పేర్కొన్నారు.