‘అల్లరి’ నరేష్ “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” రిలీజ్ డేట్ ఖరారు.!

-

నాంది తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నాంది సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు నటుడిగా నరేష్ కు చాలా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే సినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలాగే టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఆల్రెడీ వచ్చిన పోస్టర్ సహా టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు అయితే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఈ నవంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టు నరేష్ పై మంచి పోస్టర్ తో అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో ఆనంది ఫిమేల్ లీడ్ లో నటించగా వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news