నా కుమార్తెకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం లేదు: మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి

-

రాడిస్ బ్లూ హోటల్ లో డ్రగ్స్ పట్టుబడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన కలిగించింది. ఇందులో రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న బార్, ఫుడ్డింగ్, మింక్ పై పోలీసులు దాడికి సంబంధించి నా కుమార్తె తేజస్వీపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని క్లారిటీ ఇచ్చారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. నా కుమార్తెపై కొన్ని మీడియాల్లో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. నా కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారని వస్తున్న వార్తలను ఖండించారు. 

నాకుమార్తెకు పుడ్డింగ్, మింక్ ల యాజమాని కాదని, స్థాపన నిర్వహణలో ఆమెకు సంబంధం లేదని ఆమె అన్నారు. సెన్సేషనల్ రిపోర్టింగ్ లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లను ప్రస్తావించి, లాగడాన్ని ఆమె ప్రశ్నించారు. గౌరవప్రదమైన మీడియా సంస్థలు, ప్రాథమిక పాత్రికేయ ప్రమాణాలను పాటించాలని ఆమె సూచించారు. వాస్తవాలను తెలుసుకుని ప్రసారం చేయాలని ఆశిస్తున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news