సీఎం జగన్ ను కలిసిన టాటా అడ్వాన్సుడ్ సిస్టం లిమిటెడ్ ప్రతినిధులు

-

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్, రెగ్యులేటరీ హెడ్‌ జే. శ్రీధర్, టాటా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ హెడ్‌ మసూద్‌ హుస్సేనీ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ సాగింది.

ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్నారు సీఎం జగన్. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు సీఏం. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం.

Read more RELATED
Recommended to you

Latest news