కేసీఆర్‌ సర్కార్‌పై సీబీఐకి రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు !

-

కేసీఆర్‌ సర్కార్‌ పై సీబీఐకి రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. కోకాపేట భూముల విక్రయం లో రూ. 1500 కోట్ల కుంభకోణం జరిగిందని…ఈ కుంభకోణం పై విచారణ జరగాల్సిన అవసరం ఉందని తన ఫిర్యాదు లో పేర్కొన్నారు రేవంత్‌ రెడ్డి. కుంభకోణా ల్లో అనేక మంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఉందని ఫిర్యాదు పేర్కొన్న రేవంత్‌ రెడ్డి.

revanth-reddy-cm-kcr

కెసిఆర్ సన్నిహితులు ఉన్నతాధికారులు భూములు దక్కించుకున్నారని ఆరోపణలు చేశారు. అధికార బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కెసిఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు రేవంత్‌ రెడ్డి. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి అప్పాయింట్మెంట్స్ కోరానని తెలిపారు రేవంత్‌ రెడ్డి. సీఎం కేసిఆర్ అవినీతి పై చర్యలు తీసుకోవడం లో అధికార బిజెపి పార్టీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలని రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కాగా… ఇటీవలే… ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు… కోకాపేట భూములను తెలంగాణ సర్కార్‌ అమ్మిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news