తెలంగాణను నాశనం చేసేందుకు రేవంత్‌ కంకణం కట్టుకున్నారు : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వికృతమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ దేశ్ పతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవీ ప్రసాద్ తో కలిసి ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  అందులో భాగంగానే ప్రతిపక్ష నాయకుల ఇండ్ల పై దాడులు చేయిస్తున్నారని.. అక్రమంగా నిర్భందిస్తున్నారని విమర్శించారు. దాడుల సంస్కృతిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తుందా..? అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడైనా దాడులు జరిగాయా..? అన్నారు. 

దాడుల సంస్కృతి రాష్ట్రానికి మంచిది కాదన్నారు.తెలంగాణను నాశనం చేసేందుకు రేవంత్‌ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ఆయన విధ్వంసకర పరిపాలన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నదని ఫైర్‌ అయ్యారు. తెలంగాణను ప్రేమించే వాళ్లు రేవంత్‌ వైఖరిని ఖండించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో కాంగ్రెస్‌ విఫలమైందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news