కేటీఆర్ కి పిచ్చి పట్టింది.. రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్..!

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ కు పదవీ లేక పిచ్చి పట్టిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ కి పిచ్చేకి.. అమిత్ షా పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేవలం హింది మాత్రమే నేర్చుకోవాలని చెప్పారని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు.

పక్క రాష్ట్రానికి వెళ్తే అందరూ ఏ భాష మాట్లాడుతారు..? మీ నాన్న సీఎం గా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో ఏ భాషలొ మాట్లాడారని నిలదీశారు. ఇదిలా ఉండగా.. ఇంగ్లీషు భాషకి తాను వ్యతిరేకిని ఏం కాదని.. ప్రతీ విద్యార్థి మాతృ భాషతో పాటు హిందీని కూడా నేర్చుకోవాలని సూచించారు అమిత్ షా. ఇది దేశీయ భాషల పరిరక్షనకు చాలా అవసరమన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. భారతదేశ గొప్పతనం ఈ భాష వైవిద్యం లో ఉందని.. ఇది దేశ గొప్పదనమన్నారు. కేటీఆర్ బాషోన్మాదానికి పాల్పడితే దేశానికే ముప్పు అని హెచ్చరించారు రాజాసింగ్. 

Read more RELATED
Recommended to you

Latest news