వీహెచ్ ఇంటిపై దుండగుల దాడి…ఖండించిన రేవంత్ రెడ్డి

-

మాజీ ఎంపీ వి. హనుమంతరావు రావు ఇంటి పైన దుండగుల దాడి ని తీవ్రంగా ఖండించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. హనుమంతరావు తో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు ఇంటిపై దుండగులు అర్ధరాత్రి దాడి చేసి రాళ్లు వేయడం తో ఆయన ఇంటి అద్దాలు.. కారు ధ్వంసం అయిందని ఫైర్‌ అయ్యారు రేవంత్‌ రెడ్డి.

తెలంగాణలో రోజు రోజుకూ శాంతి భద్రత లు క్షిణిస్తున్నాయని మండి పడ్డారు. దోషులను పోలీసులు వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. వి.హనుమంతరావు ప్రజల మనిషి ఎవరి ఆపద వచ్చిన ముందుంటారు అలాంటి వ్యక్తిపై దాడి ఏమిటని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేది లేదు.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news