విహెచ్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి..

-

అనారోగ్యంతో బాధ పడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును కొత్తగా ఎంపికైన టిపీసీసీ రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వి.హనుమంతరావు ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చానని.. ఆయన ఆరోగ్యం కుదటపడిందని చెప్పారు. హాస్పిటల్ లో ఉన్నా.. ప్రజా సమస్యలపై తనతో విహెచ్ చర్చించారని విన్నవించారు. దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్ గా ఉన్నారని.. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహం పై పోరాడాలని సూచించారని పేర్కొన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ద్రోహి సీఎం కేసీఆర్ అని.. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారని మండిపడ్డారు.

125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి.. తట్టెడు మట్టి తీయలేదని ఫైర్ అయ్యారు. దళిత ఎంపర్ మెంట్ అని కేవలం నియోజకవర్గానికి వంద కుటుంబాలకు సహాయం అనడం ద్రోహమని మండిపడ్డారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కెసిఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారు. పార్టీ అభివృద్ధి విషయంలో కొన్ని సలహాలు విహెచ్ ఇచ్చారని.. మేడమ్ సోనియా గాంధీ వద్దకు స్వయంగా కలిసి వెళ్దామని చెప్పారన్నారు. వీహెచ్ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news