పొంగులేటిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాం – రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్

-

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ ఆధ్యక్షడు రేవంత్ రెడ్డి. పొంగులేటి సిద్ధాంతం మంచింది…ఆయన ఎంచుకున్న బీజేపీ విధానం సరైంది కాదని వివరించారు. పొంగులేటి కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తం..ఇప్పటికే బీజేపీలో చేరిన వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

అటు ప్రగతి భవన్ పెల్చేయాలన్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. నేను కేసులకు భయపడను..నాకు కొత్త ఏమి కాదు…కేసీఆర్ భూతం లాంటివాడు….పట్టి సీసాలో బందించాలి…. లేకపోతే తట్టుకోలేమన్నారు. తెలంగాణ పదాన్ని అసహ్యించుకున్న వాళ్ళను ప్రగతి భవన్ లో కెసిఆర్… కూర్చోబెట్టాడని మండిపడ్డారు.90 శాతం తెలంగాణ ద్రోహులు మంత్రులుగా ఉన్నారు…రసమయి బాలకిషన్ ఉద్యమకారుడు, విద్యావంతుడు మంత్రిని చేయొచ్చు కదా….? అని ఆగ్రహించారు. ఏబీసీడీ లు రాని ఎర్రబెల్లిని కులం చూసుకొని మంత్రిని చేశారని ఫైర్ అయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news