సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

-

సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలపై సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హైకోర్టు ఆదేశించిన ప్రిలిమినరీ పరీక్షలోని ఏడు ప్రశ్నలను తొలగించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేస్తే దాదాపు 50 నుంచి 60 వేల మంది అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులకు హాజరయ్యే అవకాశం లభిస్తుందని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

ఎంపిక కోసం నిర్వహించే ఫిజికల్ ఈవెంట్లలో మూడింటికి మూడు అర్హత సాధించిన వారికి ఏ ఆర్, టీఎస్ ఎస్పీ కేటగిరి పోస్టుల భర్తీలో అవకాశం కల్పించాలని కోరారు. ఇదేనా టిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిల్చారని విమర్శించారు. అభ్యర్థులు తమ ఆవేదనను మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ విన్నవించుకున్న సమాధానం రాలేదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news