కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

-

సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాజీవ్ రైతు భరోసా దీక్షలో అనేక మంది రైతులు తమ సమస్యలు నా దృష్టికి తెస్తున్నారని, రెండేళ్లైనా లక్ష రుణమాఫీ హామీ అమలు కాలేదని రేవంత్ లేఖలో పేర్కొన్నారు. బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదన్న ఆయన రైతు బంధు నిధులు పాత రుణాల వడ్డీ కింద జమేసుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే తక్షణం రుణమాఫీ నిధులు విడుదల చేయండని రేవంత్ రెడ్డి కోరారు.

యాసంగి నాట్లు మొదలైన తరుణంలో యూరియా కొరత ఉందని రైతులు చెబుతున్నారని రేవంత్ పేర్కొన్నారు. సన్నవడ్లు పండించిన రైతులకు పెట్టుబడి రాని పరిస్థితి ఉందన్న ఆయన దీనికి మీరే బాధ్యులని అన్నారు. వారిని ఎలా ఆదుకుంటారో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. కొందరు రైతులకు రైతుబంధు నిధులు పడటం లేదని, ఫాంహౌస్ లో కూర్చుని దృతరాష్ట్రుడిలా అంతా బాగుంది అని భ్రమించకండని రేవంత్ లేఖలో పేర్కొన్నారు. తక్షణం నేను లేవనెత్తిన రైతుల సమస్యలు పరిష్కరించండని రేవంత్ లేఖలో కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news