కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి

-

కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు రావని, అందరం కలిసి పని చేస్తే కాంగ్రెస్ కు 40 సీట్లు వస్తాయని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది కానీ ఎన్నికల తరువాత కేసీఆర్, కాంగ్రెస్ తో కలవక తప్పదన్నారు. అయితే కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.

కోమటిరెడ్డి ఏం మాట్లాడారో చూడలేదని, పార్టీకి నష్టం కలిగిస్తే అధిష్టానం చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు ఇన్చార్జి మాణిక్ రావు థాక్రె సైతం పెద్దగా స్పందించలేదు. అయితే పార్టీకి నష్టం కలిగితే చర్యలు తీసుకుంటుందని మాత్రం రేవంత్ రెడ్డి చెప్పారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేతలు ఆచితూచి మాట్లాడుతుండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news