తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ. 25 వేలు పింఛను:రేవంత్ రెడ్డి !

-

తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. ఈ రోజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎందరో అమరవీరుల త్యాగఫలం అయిన ఈ తెలంగాణ వారికి తిరిగిచ్చే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ అమరవీరుల కుటుంబాలలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. అంతే కాకుండా ఈ కుటుంబానికి ప్రతినెలా రూ. 25 వేల ఫించను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ చేసినా వారి త్యాగానికి గుర్తింపు ఉండదని రేవంత్ రెడ్డి మదనపడ్డారు. గతంలో భారతదేశ స్వాతంత్య్రం కోసం ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేసి ఇంగ్లీష్ దొరలను తరిమికొట్టారని, అందువలనే ఈ రోజు మనము ఎంతో సంతోషంగా జీవిస్తున్నామన్నారు.

అదే విధంగా ఇప్పుడు తెలంగాణ కోసం కష్టపడి ప్రాణాలు అర్పించిన వారికి కూడా స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని మాటిచ్చారు. కాగా ఇప్పటికీ ఎందరో ఉద్యమకారులపై కేసులు ఉన్నాయని.. వాటిని కూడా తీసివేయిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news