మళ్లీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు… రాసిపెట్టుకోండి : రేవంత్ సంచలనం

-

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలతో రాజకీయాలను వేడెక్కిస్తుంటాడు రేవంత్ రెడ్డి. పీసీసీ ప్రకటన వచ్చిన.. మొదటి రోజునే ఈటెల రాజేందర్ బీజేపీ లో చేరిక పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

revanth-reddy-cm-kcr

2022 ఆగస్ట్ 15 తర్వాత ప్రభుత్వాన్ని సిఎం కెసిఆర్ రద్దు చేస్తారని చెప్పిన రేవంత్… మళ్లీ ముందస్తు ఎన్నికలు వస్తాయి.. రాసి పెట్టుకోండి అంటూ హాట్ కామెంట్ చేశారు. అంతేకాదు.. కేటీఆర్ ని ముఖ్యమంత్రి గా కెసిఆర్ చేయబోరని స్పష్టం చేశారు.

మరోసారి అధికారంలోకి వచ్చేందుకే.. కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు అడుగులు వేస్తున్నారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ లో చేరే ముందే టిడిపి పదవులు అన్నిటికీ రాజీనామా చేశానని… నేను టిడిపి పార్టీ అయితే మరీ కెసిఆర్ ఏంటి అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో ఉన్నవాళ్ళంతా.. టిడిపి పార్టీనేనని ఫైర్ అయ్యారు రేవంత్.

Read more RELATED
Recommended to you

Latest news