కెసిఆర్ చింతమడక చీటర్.. మూడు చింతలకు కట్టి చీల్చుతా : రేవంత్

-

సిఎం కెసిఆర్ చింతమడక చీటర్ అని…ఈ మూడు చింతలకు కట్టి చీల్చాలని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల ముడు చింతలపల్లి లో రెండు రోజుల దీక్షను రేవంత్ రెడ్డి విరమించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ …హుజురాబాద్ లో కెసిఆర్ కు ఓటమి భయం పట్టుకుందని… నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టమంటే.. ఎవ్వరు రాలెదని ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజం.. కేసీఆర్ కుటుంబానికి మస్తు చేసిందని…తెలంగాణ కోసం కొట్లాడిండు అని రెండు సార్లు సీఎం చేశారని తెలిపారు.

revanth-reddy-cm-kcr

కానీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చేశాడు అని ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరిస్తే.. తెలంగాణ దొంగల పాలైందని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అడవి పందుల్లా.. దోచుకుంటున్నారని…దళిత, గిరిజనులందరికి బంధు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు.

కాంగ్రెస్ దండోరా సభలతో..కేసీఆర్ అనే ఎలుక బయటికొచ్చిందని చురకలంటించారు. కేసీఆర్.. జపాన్ ఎలుక లాంటి వాడు.. ప్రమాదాన్ని ముందే గ్రహించి బయటకి వచ్చాడు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నీ టైం ఐపోయింది.. ఇక నీవు ఇంటికేనని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్ ను డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ బహుజన్ భవన్ గా మారుస్తామని…అక్కడి నుండే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్లేలా చూస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news