REVANTH REDDY : టీపీసీసీగా అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు

-

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, గీతా రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.

అయితే.. ఈ కార్యక్రమానికి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరు కాలేదు. ఇక అంతకు ముందు రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడిలో పూజలు చేశారు. అనంతరం కార్యకర్తల తో నాంపల్లిలోని దర్గాకు ర్యాలీ గా బయలుదేరి… అక్కడ చాదర్ సమర్పించారు రేవంత్ రెడ్డి. అక్కడ నుంచి నేరుగా గాంధీ భవన్ చేరుకున్న రేవంత్ రెడ్డి… పిసిసి బాధ్యతలను చేపట్టారు. కాగా.. టీపీసీసీ గా రేవంత్‌ రెడ్డి పేరు రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం మొదలైన సంగతి తెలిసిందే. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. బహిరంగంగానే రేవంత్‌ రెడ్డిని వ్యతిరేకించారు.

Read more RELATED
Recommended to you

Latest news