తెలంగాణ సరిహద్దులో ఆర్కే అంత్యక్రియలు

-

మావోయిస్టు అగ్ర నేత ఆర్కె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఈ మేరకు ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తయ్యాయి. పామేడు – కొండపల్లి సరిహద్దు ప్రాంతా ల్లో ఆర్కే అంత్యక్రియలు జరిగాయి. నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు అంత్య క్రియలు పూర్తి కాగా వీటికి సంభందించిన ఫోటోలను విడుదల చేసింది మావోయిస్టు పార్టీ.

ఇక ఆర్కే అంత్యక్రియలకు మావోయిస్టులు భారీగా హాజరయ్యారు. మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్య క్రియలు పూర్తి చేసింది మావోయిస్టు పార్టీ. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి ఈ సందర్భంగా నివాళులు అర్పించారు మావోయిస్టులు. కాగా శుక్రవారం మధ్యాహ్నం ఆర్కె మరణం పై మావోయిస్టు కేంద్ర కమిటీ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కిడ్నీల సమస్యతో ఈ నెల 14 న ఆర్కే మరణించాడని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news