నిర్మ‌ల్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం..పెళ్లికొడుకు,పెళ్లి కూతురు మృతి..!

-

పెళ్లైన మ‌రుస‌టి రోజే వ‌దూవ‌రుల కుటుంబంలో విషాదం నిండింది. క‌ల‌కాలం క‌లిసి ఉండాల‌ని పెళ్లి చేసుకున్న ఆ జంట ఆశలు ఒక్క రోజులోనే ఆవిర‌య్యాయి. రిసెప్షెన్ పూర్తి చేసుకుని వ‌స్తున్న ఆ కొత్త జంట‌ను రోడ్డు ప్ర‌మాదం మృత్యువు రూపంలో వెంటాడి మింతివేసింది. ఈ ఘ‌ట‌న నిర్మ‌ల్ జిల్లాలో చోటు చేసుకుంది. కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

మహారాష్ట్ర బల్లర్షాలోని రాజురా కు మారుపెండ్లి ( రిసెప్షన్ ) కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జ‌రింగింది. మరో 10 నిమిషాలలో ఇళ్లు చేరుకుంటామనే సమయంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న ప్రమాదంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు తీవ్ర గాయాల‌య్యాయి. దాంతో ఇద్ద‌రూ అక్క‌డికక్క‌డే మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రి స్వ‌ల్ప‌గాయాలు కాగా వారిని ఖానాపూర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Read more RELATED
Recommended to you

Latest news