జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 27 మంది !

-

తెలంగాణలోని జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న టూరిస్టు బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏ విధంగా 27 మంది కి గాయాలు అయ్యాయి. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఘటన వివరాల్లోకి వెళితే… జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రం శివారులోని ఇందిరా నగర్ వద్ద.. ఆగివున్న టూరిస్టు బస్సును ఓ టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 27 మందికి గాయాలయ్యాయి.

అయితే ఇందులో 14 మందికి తీవ్రగాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటన జరిగిన స్థలంలో ఉన్న స్థానికులు… క్షతగాత్రులను వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి… తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పేట గ్రామం గా పోలీసులు గుర్తించారు. విహార యాత్ర నేపథ్యంలో 27 మంది సభ్యులు గోవాకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. లారీ డ్రైవర్ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news