బ్రేకింగ్ : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడిక్కడే !

-

ఏపీలో రహదారులు రక్తమోడుతున్నాయి. అను నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదానికి సంబందించిన వార్త వింటూనే ఉన్నాం. తాజాగా కృష్ణా జిల్లా విజయవాడ దగ్గరలోని హనుమాన్ జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే  మృతి చెందారు. 

భీమవరంలో పెళ్లి కి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. చనిపోయిన ముగ్గురిలో ఒకరు విజయవాడ వ్యక్తి కాగా మరో ఇద్దరు చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి వాసులు అని తెలుస్తోంది. పొగమంచు దట్టంగా ఉండడంతో ఎదురుగా ఆపి ఉన్న లారీ కనిపించకపోవడంతో ఈ ప్రమాదం  జరిగినట్టుగా చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. 

Read more RELATED
Recommended to you

Latest news