ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏసీపీ పరిస్థితి విషమం..!

-

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన నిజామాబాద్‌ యాంటీ నక్సల్‌ బ్యూరో ఏసీపీ, కన్‌ఫర్డ్‌ ఐపీఎస్ ఆఫీసర్ బాలూ జాదవ్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కూసుమంచి మండలం జీళ్లచెరువు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు ఓ చెట్టును ఢీకొట్టింది. నిజామాబాద్‌లో డ్యూటీ ముగించుకుని వస్తుండగా ఈ ఘటన సంభవించింది.

విషయం తెలిసిన వెంట‌నే ఆయ‌న సోద‌రుడు ప్రమాద స్థలికి చేరుకుని తొలత నేలకొండపల్లి ఆస్ప‌త్రికి తరలించారు. అయితే,  బాలూ జాదవ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, సీటు బెల్ట్‌ పెట్టుకోవడం, ఎయిర్‌ బెలూన్‌ తెరచుకోవడంతో డ్రైవర్ చిన్న గాయాలతో బయటపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news