జాతీయ జెండాను అవమానించిన రోహిత్?

-

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీమిండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సామాజిక మాధ్యమాల వేదికగా భారతీయ సహోదరులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దేశ ప్రజలకు, తన అభిమానులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జాతీయ జెండాను పట్టుకొని ఫోటోను షేర్ చేసి మరి, రోహిత్ శర్మ దేశ ప్రజలకు, తన అభిమానులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అయితే, ఈ ట్విటే ఇప్పుడు వివాదంగా మారిపోయింది. రోహిత్ శర్మ ఆ పోస్ట్ లో పట్టుకున్న జెండా మార్ఫింగ్ చేసినట్లు ఉందంటూ నేటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. జాతీయ జెండాను ఎడిటింగ్ చేసి శుభాకాంక్షలు చెప్పడం ఏంటి అని నిలదీస్తున్నారు. జాతీయ జెండా కొనుక్కునే డబ్బులు లేకపోతే, మేమైనా పైసలు ఇచ్చే వాళ్ళం కదా అంటూ మరికొందరు నెటిజెన్లు మండిపడుతున్నారు. ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేయించావా రోహిత్ అంటూ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఒక జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఉండి, ఇలా వ్యవహరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news