IND vs WI: రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!

-

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ 20 ల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ 20 క్రికెట్‌ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ ను అధిగమించి.. రోహిత్‌ శర్మ అగ్ర స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌ తో జరుగుతోన్న తొలి టీ 20 మ్యాచ్‌ లో 64 పరుగులు చేసిన రోహిత్‌ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్‌ 3443 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.

కాగా టీమిండియా మరో సారి దుమ్ములేపింది. మూడు వన్డేల సిరీస్‌ లో విండీస్‌ ను చిత్తు చేసిన టీమిండియా టీ 20 ల్లోనూ అదే తీరుగా వెళుతోంది ఐదు వన్డేల సిరీస్‌ లో భాగంగా ట్రినిడాడ్‌ టారౌబాలోని బ్రియాన్‌ లారా స్టేడియంలో గత రాత్రి జరిగిన మొదటి మ్యాచ్‌ లో రోహిత్‌ సేన ఏకంగా 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news