బండి సంజయ్ కి రోహిత్ రెడ్డి సవాల్..దమ్ముంటే భాగ్యలక్ష్మి టెంపుల్‌ కు రా !

-

మరి కాసేపట్లో పాత బస్తి భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెళ్లనున్నారు. బెంగుళూరు డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చాయని అంటున్న బండి సంజయ్ కు అక్కడి నుంచి సవాల్ విసరనున్న రోహిత్ రెడ్డి.. ఈ నేపథ్యంలోనే పాత బస్తి భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు వెళ్లనున్నారు.టార్గెట్ లో భాగంగానే నాకు ఈడి నోటీసులు ఇచ్చారని, బండి సంజయ్ చెప్పినట్టు నాకు ఈడి నోటీసులు వచ్చాయని ఆగ్రహించారు పైలెట్ రోహిత్ రెడ్డి.

బిజెపి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని.. బిజెపి వెయ్యి పడగల పామని నిప్పులు చెరిగారు. బండి సంజయ్ అంటున్నారు నాకు కర్ణాటక డ్రగ్ కేసులో సంబంధం అంటున్నారని..ఒక హిందువుగా నేను సవాల్ విసురుతున్న, బండి సంజయ్ కు 24 గంటల సమయం ఇస్తున్నానని హెచ్చరించారు పైలెట్ రోహిత్ రెడ్డి. నా పై చేసిన ఆరోపణలను భాగ్య లక్ష్మి అమ్మవారి ముందు బండి సంజయ్ రుజువు చెయ్యాలని సవాల్‌ చేశారు పైలెట్ రోహిత్ రెడ్డి. హిందూ వాదిగా చెబుతున్న…కర్ణాటక పోలీసుల నుంచి నాకు ఎటువంటి నోటీసులు రాలేదని.. బండి సంజయ్ తడి బట్టలతో వచ్చి …నాపై చేసిన ఆరోపణలు రుజువు చూపాలన్నారు. లేకుంటే బండి సంజయ్ అమ్మవారి ముందు తప్పు చేసినట్టు ఒప్పుకోవాలని వార్నింగ్‌ ఇచ్చారు పైలెట్ రోహిత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news