జగన్‌ ఉన్నంత వరకు చంద్రబాబు సీఎం, లోకేష్‌ ఎమ్మెల్యే కాలేరు : రోజా

-

జగన్ ఉన్నంతవరకూ నువ్వు ముఖ్యమంత్రి కాలేవు…నీ కొడుకు ఎమ్మెల్యే కాలేడని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు వరద బాధితుల దగ్గర బురద రాజకీయాలు చేస్తున్నారని.. మీ హయాంలో ఎవరికైనా కోటి రూపాయలు పరిహారం ఇచ్చారా..? అని ఫైర్‌ అయ్యారు. వరద బాధితుల దగ్గర అసెంబ్లీలో అనని మాటలు ఎలా చెప్తావని… చంద్రబాబుకు కుప్పం దెబ్బకు పిచ్చెక్కింది..ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏరియల్ సర్వే చేయలేదా…జగన్ ఏరియల్ సర్వేపై విమర్శలు చేస్తారా.. చంద్రబాబు చెప్పేదంతా నమ్ముతారనుకోవడం పొరపాటన్నారు.

జనం దగ్గరకు వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బంది అని ఏరియల్ సర్వేకు వెళ్లారని… నీ మాటలు నీ శాడిజంకు పరాకాష్ట అంటూ నిప్పులు చెరిగారని.. సోనియాతో కుమ్మక్కై జగన్ పై తప్పుడు కేసులు పెట్టించావని మండిపడ్డారు. సోనియా గాంధీ నుంచి శంకర్రావు వరకూ ఏమయ్యారో తెలుసుకో… వరదలు మానవ తప్పిదం ఎలా అవుతుందో చెప్పాలి. పుష్కరాల్లో షూటింగ్ కోసం ఎంత మందిని బలి తీసుకున్నావని మండిపడ్డారు. పుష్కరాల తొక్కిసలాట సీసీ ఫుటేజీ బయటపెడితే చంద్రబాబు చిప్పకూడు తినేవాడని.. చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news