కేసీఆర్ ఢిల్లీకి వెళ్లింది.. ఆయన శ్రీమతి ఆరోగ్యం కోసమే : కిషన్ రెడ్డి

-

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లింది.. ఆయన శ్రీమతి ఆరోగ్యం కోసమేనని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని… మెట్రో రైల్ విషయం లో గతంలోనే చేసుకున్న ఒప్పందాల కు విరుద్ధంగా ఎల్ అండ్ టీ వ్యవహరించిందని వెల్లడించారు.. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మోడీ ఫొటో పెట్టక పోవడానికి కారణం రాజకీయాలేనని… రెండేళ్ల కదా ఈ(కేసీఆర్) ప్రభుత్వం ఉండేదన్నారు.

హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని… బస్తీ దావాఖానాలు కేంద్ర ప్రభుత్వానివే.. రాష్ట్రం పేరు మార్చిందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కిట్ లో కేంద్రం భాగస్వామ్యం ఉందని.. డబల్ బెడ్రూం లలో కూడా కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని చెప్పారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లింది ఆయన శ్రీమతి ఆరోగ్యం కోసమేనని… అగ్గిపెడతానని కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాడని ఫైర్‌ అయ్యారు. ప్రోటోకాల్ అధికారుల తీరుపైన సీఎస్ కు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్‌ ఇచ్చారు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news