వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తాం – రోజా సంచలన ప్రకటన

-

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా. రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లు మావే అన్నారు రోజా. లంబసింగి వెళుతూ నర్సీపట్నంలో రాయల్ పార్క్ రిసార్ట్స్ లో మీడియాతో మాట్లాడారు పర్యాటక మంత్రి రోజా.

సంక్షేమ పథకాలు, వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను రద్దు చేసేస్తామన్న టిడిపి ఇప్పుడు మాటను మార్చింది అన్నారు. జగన్ వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు విశ్వసించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.

కోవిడ్ అనంతరం పర్యాటకం పుంజుకుందన్నారు. యూత్ ఫెస్టివల్ నిర్వహణ వల్ల యువకుల్లో ప్రతిభ బయటకు వస్తుంది. ప్రకృతి అందాలు దెబ్బతినకుండా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నాం. టెంపుల్ టూరిజం లో దేశంలోనే ఏపీ మూడో స్థానం సాధించింది అన్నారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news