నాకు 30 నిముషాల సమయం ఇస్తే ఏపీ అప్పు తీర్చేస్తా – కేఏ పాల్

-

నాకు 30 నిముషాల సమయం ఇస్తే ఏపీ అప్పు తీర్చేస్తానని పేర్కొన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నారు. ఏపీ రాజకీయాలపై తనదైన రీతిలో స్పందించారుకేఏ పాల్. చంద్రబాబు ఏం చేసినా కొడుకు కోసమే తప్ప రాష్ట్రం కోసం కాదన్నారు.

లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కి మళ్లీ పాలన పగ్గాలిస్తే ఇబ్బందే. ఏపీలో 100కి 60% ప్రజలు నన్నే కోరుకుంటున్నారు. చంద్రబాబు, జగన్ ను గెలిపిస్తే బిజెపిని గెలిపించినట్టే. చంద్రబాబు ఇక సీఎం అవడు. టిడిపి, వైసిపి, జనసేనకు ఓటేస్తే బిజెపికి ఓటు వేసినట్టే. ఏపీలో పరిస్థితులు విషమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారని జగన్ సీఎం అయ్యాక ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. జగన్ నాకు 30 నిమిషాల సమయం ఇస్తే కలిసి రాష్ట్రం అప్పు తీర్చి, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news