కెసిఆర్ కే చంద్రబాబు విందు ఇచ్చాడు : రేవంత్ పై రోజా ఫైర్

-

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపిఐఐసి చైర్మన్ రోజా… చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి…. తెలుగుదేశం కోవర్టుగా కాంగ్రెస్ పార్టీలో వున్నాడని…కేసిఆర్ కి చంద్రబాబు 28 రకాల వంటకాలుతో విందు ఏర్పాటు చేసింది రేవంత్ కి గుర్తు లేదా? అని ఫైర్ అయ్యారు.

రైతులును దగా చేసిన ప్రభుత్వం చంద్రబాబుదని… రైతుల కోసం జగన్ నాలుగు అడుగులు ముందుకు వేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసారన్నారు. 83 వేల కోట్ల రూపాయలును వివిధ పథకాల ద్వారా రైతులు అందజేసిన ప్రభుత్వం జగన్ దని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని…గతంలో అక్క ఉమా…. హరిష్ రావు… పోలీసులు కొట్టుకున్న విషయం లోకేష్ మర్చిపోయాడా ? అని ప్రశ్నించారు. 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని లో వుండకూండా పారిపోయి వచ్చింది లోకేష్ తండ్రి కాదా? అని ఫైర్ అయ్యారు.

మా ఇంటికి జగన్ ఎప్పుడు రాలేదు… ఇక కేసిఆర్ తో మంతనాలు ఎలా జరుపుతారు? అని నిలదీశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని పరిష్కారించవలసిన భాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news