కోడి కత్తి కేసులో శ్రీనుకు ప్రాణహాని ఉంది – RRR

-

 

జగన్ మోహన్ రెడ్డి గారిపై కోడి కత్తితో దాడి చేసిన శ్రీనుకు ప్రాణహాని ఉన్నదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి గారిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో కోడి కత్తితో శ్రీను అనే వ్యక్తి దాడి చేయగా, ఆయన కనీసం ప్రాథమిక చికిత్స చేయించుకోకుండానే హైదరాబాదుకు అనుకున్న సమయానికే విమానంలో బయలుదేరి వెళ్లారని, కోడి కత్తితో దాడి చేసినట్టుగా చెబుతున్న చోట కనీసం కుట్లు కూడా వేయలేదని, డాక్టర్ శ్రీనివాస్ గారు చెబుతున్నట్లుగా బియ్యం మధుసూదన్ రెడ్డి అనే ప్రస్తుత ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి గారిపై కోడి కత్తి దాడి జరిగిందని చెబుతున్న చోట టమాటా సాస్ రాశారని, అసలు దాడి అన్నదే జరగలేదని, రక్తమే బయటకు రాలేదన్నారు.

 

కనీసం చొక్కా కూడా చిరగలేదని తెలిపారు. కోడి కత్తితో దాడి జరిగి ఉంటే లోతైన గాయం అయి ఉండేది కదా… లోతైన గాయం అయినచోట కుట్లు వేసి ఉండి ఉంటే, ఆ కుట్లను ముఖ్యమంత్రి గారు చూపించాలని డాక్టర్ శ్రీనివాస్ గారు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కోడి కత్తి కేసులో నిందితుడుగా అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీనుకు రెండు ఎకరాల భూమిని ఇస్తామని చెప్పి, విశాఖ విమానాశ్రయంలో కలిసిన అతన్ని ఒప్పించి ఈ దాడి కుట్రకు పథకం రచించారని, అనుకున్నది అనుకున్నట్లుగానే అమలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారని, అయినా ఇంకా ఎన్ని రోజులు శ్రీను జైలులోనే మగ్గిపోవాలని ప్రశ్నించారు. కోర్టుకు రమ్మంటే ముఖ్యమంత్రి గారు ఏవో కుంటి సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారని, ఒకవేళ డాక్టర్ శ్రీనివాస్ గారు చెబుతున్నది నిజం కాకపోతే అతన్ని పిలిచి అడగాలని, ఇది రాజకీయ లబ్ధి కోసం ఆడిన నాటకం అని స్పష్టమవుతుందని, ఒకవేళ అదే జరిగి ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కేసులో దోషిగా తేలుతారని, కోడి కత్తి దాడి వల్లనే ఎన్నికల్లో తమ పార్టీ నెగ్గిందన్నది నిష్ఠూరమైన నిజమని, ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ కోర్టుకు హాజరు కానని చెబుతున్నారంటే సంథింగ్ రాంగ్ అని రఘురామకృష్ణ రాజు గారు వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news