సజ్జల రామకృష్ణ రెడ్డి: హై కోర్ట్ తీర్పును స్వాగతిస్తున్నాము !

-

ఈ రోజు హై కోర్ట్ ఇచ్చిన తీర్పు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులలో ఒకరైన సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. రాష్ట్ర రాజధానులలో ఒకటిగా మనము చెప్పుకుంటున్నా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థల పంపిణీకి సంబంధించిన కేసులో హై కోర్ట్ పాజిటివ్ గా తీర్పు ఇవ్వడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఈ విషయంపై కొందరు అన్యాయంగా దీనికి వ్యతిరేకంగా పిటీషన్ వేశారని గుర్తు చేశారు, ఎంతలా అంటే పేదలకు అస్సలు అమరావతిలో నివసించే హక్కు లేదు అనడం చాలా దారుణాన్ని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కోర్ట్ ఇచ్చిన తీర్పుతో అలాంటి వారి నోళ్లకు మూతపడినట్లే అన్నారు.

ఈ దేశానికి అందరూ చాలా ముఖ్యం… ఈ సమాజానికి కార్మికులు మరియు పేదలు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హై కోర్ట్ తీర్పు ప్రకారం త్వరలోనే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news