ఇండస్ట్రీలో 12 ఏళ్లు ప్రస్థానం..సమంత ఎమోషనల్‌ పోస్ట్‌

-

అందాల ముద్దుగుమ్మ సమంత ‘ఏం మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ రావడం మాత్రమే కాకుండా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా దక్కింది. అలా స్టార్ హీరోల సరసన నటించిన సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. సమంత టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్ళాడింది.

వీరిద్దరికీ కొంతకాలం క్రితమే విడాకులు అయ్యాయి. సమంత విడాకుల తర్వాత తన సినిమాల స్పీడ్ ను మరింతగా పెంచింది. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్న సమంత మరిన్ని సినిమాలను కూడా ఒక సెట్ చేసుకుంటూ వెళుతుంది. ఇందులో భాగంగా సమంత ప్రస్తుతం యశోద సినిమాల్లో నటిస్తోంది.

ఇది ఇలా ఉండగా.. ఇవాళ్టితో సమంత.. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 12 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఎమోషనల్‌ పోస్టు చేసింది సమంత. “ఈ రోజుతో చిత్ర పరిశ్రమలో నేను అడుగు పెట్టి 12 సంవత్సరాలు. లైట్లు, కెమెరా, యాక్షన్ మరియు సాటిలేని క్షణాల చుట్టూ తిరిగే 12 సంవత్సరాల జ్ఞాపకాలు. ఈ ఆశీర్వాద ప్రయాణం మరియు ప్రపంచంలోని అత్యుత్తమ, అత్యంత నమ్మకమైన అభిమానులను కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞతతో నిండి ఉన్నాను” అంటూ ట్వీట్ చేసింది సమంత.

Read more RELATED
Recommended to you

Latest news