సినీ నటుడు బాలకృష్ణ, నటి సంయుక్త మీనన్ కలిసి ఏలూరు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన జువెలరీ షాప్ ను కలిసి ప్రారంభించారు. దీంతో ఏలూరు నగరంలోని వాసులు బాలకృష్ణ సంయుక్తను చూడడానికి విపరీతంగా అభిమానులు తరలివచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. ఆ సమయంలో నటి సంయుక్త మీనన్, బాలకృష్ణ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది.

అప్పుడు బాలయ్య సంయుక్త ను దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. బాలయ్య గొప్ప మనసును చూసి ప్రతి ఒక్కరూ సంతో షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా బాలయ్య బాబు బంగారం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య, సంయుక్తకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.
బాలకృష్ణ కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ pic.twitter.com/cBOyGWMtOh
— ChotaNews App (@ChotaNewsApp) June 14, 2025