నా పెళ్లిలో చెప్పులు, కుర్చీలు విసురుకున్నారు.. కత్రినా కైఫ్..!

-

మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో కొన్నాళ్ల పాటు ప్రేమాయణం నడిపిన కత్రినా కైఫ్ ఆ తర్వాత పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది. ఇక వీరి వివాహానికి సెలబ్రిటీలతోపాటు పరిమిత సంఖ్యలో బంధువులు, అతిథులు కూడా హాజరయ్యారు. కానీ సంతోషంగా జరుగుతుందనుకున్న వివాహంలో ఒక్కసారిగా అలజడి రేగిందని కత్రినా కైఫ్ ఆరోజు సంఘటనను ఇటీవల గుర్తు చేసుకుని మీడియాతో వెల్లడించింది.

కత్రినా కైఫ్ మాట్లాడుతూ.. “విక్కీ కౌశల్ తో పాటు పెళ్లి పీటలపై కూర్చుని అతిధుల వైపు చూస్తున్నాను.. కానీ సడన్గా నా వెనుక నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించాయి.. దాంతో అక్కడ ఏం జరుగుతోంది? అని కంగారుగా వెనక్కి తిరిగి చూస్తే.. అక్కడ నా సిస్టర్స్, విక్కీ కౌశల్ ఫ్రెండ్స్ ఒకరికొకరు బాగా గొడవ పడుతున్నారు. వారి గొడవ ఏ స్థాయికి చేరుకుందంటే? చివరికి కుర్చీలు, చెప్పులను కూడా ఒకరిపై మరొకరు విసురుకొని మరీ తిట్టుకున్నారు.. కానీ ఆ పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్ళలేకపోయాను.. ఆ తర్వాత ఆ గొడవలో ఎవరు గెలిచారో ?అడగడం కూడా మర్చిపోయాను..” అంటూ కత్రినా కైఫ్ నవ్వేసింది.

ఇక వివాహం తర్వాత తన భర్తతో కలిసి ఏమాత్రం షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ దొరికినా సరే విదేశాలకు వెళ్లిపోయి.. లైఫ్ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అలానే ఇద్దరి మధ్య ఇప్పటికీ కూడా డిన్నర్ డేట్లు కొనసాగుతూనే ఉన్నాయి . ప్రస్తుతం కత్రినా కైఫ్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. మేరీ క్రిస్మస్, టైగర్ త్రీ వంటి సినిమాలలో నటిస్తోంది. విక్కీ కౌశల్ సినిమాల విషయానికి వస్థే.. సామ్ బహదూర్, గోవిందా నామ్ మేరా వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొత్తానికైతే వీరి పెళ్లి గొడవలతో జరిగిపోయింది అని నవ్వుతూ చెప్పింది కత్రినా కైఫ్.

Read more RELATED
Recommended to you

Latest news