Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ – స్ట్రీమింగ్ ఎప్పుడంటే

-

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు,కీర్తి సురేష్ జంటగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట.” ఈ మూవీ మే 12వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయి ఘన విజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

ఈ సినిమా ఇప్పటికే 300 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు విలన్ సముద్రకనికి వార్నింగ్ ఇవ్వడానికి బయలుదేరే సన్నివేశం తో పాటు మరో రెండు మూడు సన్నివేశాల్లో జావా మెరూన్ బైక్ డ్రైవ్ చేసిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా.. తాజాగా “సర్కారు వారి పాట” నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసింది అమెజాన్‌ ప్రైమ్‌. జూన్‌ 23 వ తేదీన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ లోస్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది అమెజాన్‌ ప్రైమ్‌.

Read more RELATED
Recommended to you

Latest news