వల్లభనేని వంశీని కస్టడీకి అనుమతించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు

-

వల్లభనేని వంశీని కస్టడీకి అనుమతించింది విజయవాడ  ఎస్సీ, ఎస్టీ కోర్టు. న్యాయవాది సమక్షంలోనే  విచారించాలని ఆదేశించింది కోర్టు. మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. మరోవైపు వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నానని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వంశీ. దీంతో వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది న్యాయస్థానం. మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని పేర్కొంది.

న్యాయవాది సమక్షంలోనే వల్లభనేని వంశీని విచారించాలని కోర్టు ఆదేశించింది. ఉదయం, సాయంత్రం సమయంలో మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. ముఖ్యంగా విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకొని విచారించాలని కోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news