ఎట్టకేలకు డీఎంకే, కాంగ్రెస్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం

-

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. అలానే కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ డీఎంకే కు సంబంధించిన సీట్ల పంపిణీ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు అవి ఒక కొలిక్కి వచ్చాయి.

సీట్ల సర్దుబాటుకు సంబంధించి రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. డీఎంకే కాంగ్రెస్ కు 25 సీట్లు కేటాయించింది. అలానే కన్యాకుమారిలో జరగనున్న లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పోటీకి దిగనుంది. ఇక ఈ డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కి 25 సీట్లు, సీపీఐ 6, వీసీకే 6, ఏ డీఎంకే 6, ఐయూఎంఎల్ 3, ఎంఎస్ఎంకేకి రెండు స్థానాలు కేటాయించింది. ఇక బీజేపీకి అన్నా డీఎంకే కేవలం 20 సీట్లు కేటాయించింది. 

Read more RELATED
Recommended to you

Latest news