ప్రధాని మోదీతో మంత్రి రోజా సెల్ఫీ.. వీడియో షేర్ చేసిన ప్రధాని

-

ప్రధాని మోదీతో మంత్రి రోజా సెల్ఫీ దిగడం అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిలిచింది. సభ ముగింపులో మోడీ సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్.. అంటూ అడగడం. రోజా అడిగిన వెంటనే సెల్ఫీ కి సీఎం జగన్ తో కలిసి వచ్చి దిగారు. ఈ సీన్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. భీమవరం లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు రోజా కూడా పాల్గొన్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మంత్రి పదవి దక్కించుకున్న రోజా కు మరో అరుదైన అవకాశం దక్కింది.

దేశ ప్రధాని మోదీ, సీఎం జగన్ కలిసి హాజరైన ఒక అరుదైన వేదికపై మంత్రి హోదాలో పాల్గొన్నారు రోజా. అయితే మంత్రి రోజాకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ తో దిగిన సెల్ఫీని మోడీ ఓ వీడియో రూపకంగా తన ట్విటర్ వేదిక ద్వారా పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news