ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సెల్వన్‌-2

-

ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా సెల్వన్‌-2 ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌ణిర‌త్నం దర్శకత్వంలో సీక్వెల్‌ ప్రాజెక్ట్‌గా రాబోతున్న భారీ మల్టీస్టారర్‌ పొన్నియన్‌ చిత్రం ఇది. ఈ నేపథ్యంలో ఇవాళ చెన్నైలో మూవీ ఆడియో, ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా కొనసాగుతోంది. ఈవెంట్‌లో తారలంతా సినిమా థీమ్‌కు అనుగుణంగా ఏర్పాటు చేసిన సింహాసనంపై కూర్చొని సందడి చేశారు. సముద్రకుమారి గా నటిస్తోన్న ఐశ్వర్య లక్ష్మి సిల్వర్ కలర్‌ కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోతూ ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరోవైపు జయం రవి, శోభితా ధూళిపాళ, త్రిష కూడా సింహాసనంపై కూర్చొని మెస్మరైజ్ చేస్తున్నారు.

Ponniyin Selvan-2 | పొన్నియన్‌ సెల్వన్‌-2 ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సముద్రకుమారి.. వీడియో

ఈవెంట్‌కు కమల్‌హాసన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఇప్పుడీ వీడియోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. పొన్నియన్‌ సెల్వన్ -2 ప్రాజెక్ట్‌లో చియాన్‌ విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్‌, త్రిష, శోభితా ధూళిపాళ, పార్థీబన్‌, ప్రకాశ్‌రాజ్‌, నాజర్‌, శరత్‌కుమార్‌తో పాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ తెలుగు, త‌మిళం, హిందీ, కన్నడ, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మ‌ద్రాస్ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పార్టు -1లాగే పొన్నియన్‌ సెల్వన్‌-2 కూడా ఐమాక్స్‌ ఫార్మాట్‌లో విడుదల కానుంది. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news