జమ్మూ కాశ్మీర్ వైష్ణ దేవి ఆలయాన్ని సందర్శించుకున్న షారుక్ ఖాన్..

-

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ జమ్ము కాశ్మీర్ లో ఉన్న వైష్ణవి దేవి ఆలయాన్ని సందర్శించుకున్నారు.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

 

గత కొన్ని నెలలుగా షారుక్ ఖాన్  జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి.. 2018 రిలీజ్ అయిన జీరో ప్లాప్ తరువాత షారుఖ్ కు సినిమాలు లేవు.. ఆ తర్వాత బాలీవుడ్ హీరోలు అందరూ వరసు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న షారుక్ మాత్రం కాస్త వెనక పడ్డారు తర్వాత ఆయన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో అది కాస్త చాలా పెద్ద విషయంగా మారింది.. తర్వత ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చీట్ వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడిప్పుడే వీటన్నిటి నుంచి బయటపడుతున్న షారుఖ్ ఖాన్ ఆధ్యాత్మిక సేవలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది..

ఈ సమస్యలన్నీ బయటపడితే ఆధ్యాత్మిక సేవ చేస్తానని అనుకున్నారేమో షారుక్ ఖాన్.. అందుకే తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే తాజాగా షారుఖ్ సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే షారుఖ్ ఖాన్ ప్రస్తుతం పఠాన్‌ , జవాన్‌, డంకీ సినిమాలు చేస్తున్నాడు. ఒకదానికి ఒకటి సంబధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఈ మూవీస్ తెరకెక్కుతున్నాయి. పఠాన్ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే..

Read more RELATED
Recommended to you

Latest news