ధ్వంసమైన కారును కెసిఆర్ కు చూపించేందుకే ప్రగతి భవన్ వెళుతున్నా – షర్మిల

-

ధ్వంసమైన కారును కెసిఆర్ కు చూపించేందుకే ప్రగతి భవన్ వెళుతున్నానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. వైఎస్ షర్మిలను సోమాజిగూడలో పోలీసులు అడ్డుకున్నారు. కాసేపటి క్రితమే ప్రగతిభవన్ వైపు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నం చేశార. పాదయాత్రలో నిన్న దాడిలో అద్దాలు పగిలిన కారును తానే నడుపుకుంటూ వచ్చింది షర్మిల.

అయితే ఇది గమనించిన పోలీసులు.. పంజగుట్ట లో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడుతూ… తాను ప్రజల పక్షాన పోరాటం చేస్తూ పాదయాత్ర చేస్తుండగా టిఆర్ఎస్ గుండాలు తనపై తన కాన్వాయ్ పై దాడి చేశారని ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ గుండాల రాజ్యం నడుస్తోందని ఫైర్ అయ్యారు. ధ్వంసమైన తన వాహనాలను సీఎం కేసీఆర్ కు చూపించేందుకే ప్రగతి భవన్ వెళుతున్నానని వెల్లడించారు షర్మిల. కాగా ప్రస్తుతం పంజాగుట్ట దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news