BJP ముక్త్ భారత్ కావాలి, BRS ముక్త్ తెలంగాణ కావాలి – వైఎస్‌ షర్మిల

-

BJP ముక్త్ భారత్ కావాలి, BRS ముక్త్ తెలంగాణ కావాలని వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్ళు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని.. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, రక్తం చిందించి, ప్రజలంతా పోరాడి, స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే.. తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి,తెలంగాణను నిలువునా ముంచిండు దొర అని ఫైర్‌ అయ్యారు.

ఎనిమిదేండ్లు గడుస్తున్నా విభజన హామీల ఊసెత్తడం లేదు. నీటి వాటాపై మాట్లాడడం లేదు. మీరు చేసింది దొంగ దీక్ష కాబట్టే నోరు విప్పడం లేదా? ప్రజల పోరాటాన్ని ఆసరాగా చేసుకొని, ముఖ్యమంత్రి పీఠం ఎక్కి, అందిన కాడికి దోచుకొని, తెలంగాణను అడుగడుగునా కొల్లగొట్టి, తెలంగాణ తల్లికి ద్రోహం చేయడమే మీ దొంగ దీక్ష లక్ష్యమా? ఇన్నాళ్లు బీజేపీకి వంత పాడి, తెలంగాణ సంపదను కండ్లముందే దోచుకుండు. ఇప్పుడు అదే బీజేపీని తిట్టినట్లు చేసి, దేశాన్ని కూడా దోచుకుందామని కుట్ర చేస్తుండు. BRS, BJP స్వార్థ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు బలి అవుతున్నరు. BJP ముక్త్ భారత్ కావాలి, BRS ముక్త్ తెలంగాణ కావాలని డిమాండ్‌ చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news