మల్లికార్జున ఖర్గేకు శశిథరూర్ శుభాకాంక్షలు

-

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా విజయం సాధించిన మల్లికార్జున ఖర్గేకు శశి థరూర్ శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసి ఓడిన శశి థరూర్.. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం గొప్ప గౌరవం, బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ఖర్గే విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికలలో 1000 మందికి పైగా కాంగ్రెస్ నేతల మద్దతు పొందడం తనకి ఎంతో సంతోషంగా ఉందని అన్నారు శశిధరూర్.

ఇదిలా ఉంటే.. ఏఐసీసీ అధ్యక్షుడిగా బరిలో నిలిచిన శశిథరూర్ పై మరో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఘనవిజయం సాధించారు. 7897 ఓట్లతో ఖర్గే క్లీన్ స్వీప్ చేశారు. మరో అభ్యర్థి శశిథరూర్ 1072 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఖర్గే ఘన విజయంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద పండుగ వాతావరణం చోటుచేసుకుంది. ఖర్గే తరఫున కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ఖర్గేకు అభినందనలు తెలిపింది. ఇతర నేతలు కూడా ఖర్గేను శుభాకాంక్షలతో ముంచెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news