ఓర చూపులతో ‘దొరసాని’ కవ్వింత..శివాత్మిక ఫొటోలు వైరల్

-

‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్. డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల కూతురు శివాత్మిక..ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకునేందుకు గాను ప్రయత్నిస్తోంది.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నట వారసత్వాన్ని కొనసాగించేందుకు శివాత్మిక తన వంతు ప్రయత్నాలు చేస్తోందని చెప్పొచ్చు. ఇకపోతే శివాత్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పడికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తుంటుంది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

అలా ఓర కంట చూస్తూ చిరునవ్వుతో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటో లు చూసి నెటిజన్లు ‘‘కవ్విస్తున్నావు, సో క్యూట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. శివాత్మక ‘శేఖర్’ చిత్రంలో తన తండ్రి రాజశేఖర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించగా, ఇది మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘జోసెఫ్’కు అఫీషియల్ తెలుగు రీమేక్. ఈ నెల 20న పిక్చర్ రిలీజ్ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news