రాహుల్ కు షాక్.. వెస్టిండీస్ టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టు ఎంపిక

-

వ‌న్డే, టీ20 సిరీస్ ఆడ‌టానికి వెస్టిండీస్ భార‌త్ కు వ‌చ్చిన విషయం తెలిసిందే. నేటితో వ‌న్డే సిరీస్ ముగియ‌నుంది. మూడు వ‌న్డేల సిరీస్ లో ఇప్ప‌టికే భార‌త్ 2-0 తో లీడ్ లో ఉండి సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. నేటి మ్యాచ్ లో గెలిచి వైట్ వాష్ చేయ‌డానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు బీసీసీఐ టీ 20 సిరీస్ కు సిద్ధం అవుతుంది. తాజా గా టీ 20 సిరీస్ కోసం జట్టును కూడా ప్ర‌కటించింది.

వ‌న్డే సిరీస్ లో ఉన్న కెఎల్ రాహుల్, అక్స‌ర్ ప‌టేల్ ల‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. వీరిని జ‌ట్టులోకి తీసుకోలేదు. అలాగే ఇటీవ‌ల క‌రోనా నుంచి కోలుకున్న రుతురాజు గైక్వాడ్ ను ఎంపిక చేసింది. ర‌వి బిష్ణోయ్, వెంక‌టేష్ అయ్యార్, అవేశ్ ఖాన్, హ‌ర్షల్ ప‌టేల్ కు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చింది. కాగ బీసీసీఐ ప్ర‌క‌టించిన జ‌ట్టు ఇలా ఉంది.

జ‌ట్టు :
రోహిత్ శర్మ ( కెప్టెన్ ), కోహ్లి, ఇషాన్ కిషన్, రుతురాజు గైక్వాడ్, దీపక్ హూడా, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాద‌వ్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, చాహల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, భువనేశ్వర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్

Read more RELATED
Recommended to you

Latest news