చైనాలో మెడిసిన్స్‌ కొరత.. దొంగచాటుగా ఇండియా నుంచి విక్రయాలు..

-

కరోనాకు మన ఇండియన్స్‌ కనిపెట్టిన కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లు బాగా పనిచేసాయి..ప్రస్తుతానికి భారతదేశంలో కరోనా అదుపులోనే ఉంది. అయితే చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫోర్త్‌ వేవ్‌ వచ్చేసింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చైనాలో అత్యవసర సేవలు, మందుల కొరత వేధిస్తుంది. దీంతో చైనా ప్రజలు ఇండియా మందుల వైపు చూస్తున్నారు. చైనాలో కొవిడ్ వ్యాక్సిన్లు అయిన పాక్స్లోవిడ్, అజ్వుడిన్ కొన్ని ఆసుపత్రిలో మాత్రమే లభిస్తున్నాయి. పైగా అధిక ధరకు విక్రయిస్తుండటంతో చైనా ప్రజలు ఇండియన్ జనరిక్ డ్రగ్స్‌పై ఆధారపడుతున్నారు.

దొంగచాటుగా విక్రయాలు..

ఇండియాకు చెందిన ఔషధాల విక్రయాలను చైనా అనుమతించలేదు. చైనాలో ఇప్పుడు తిరిగి కొవిడ్‌ 19 ప్రభావం పెరిగిపోవడంతో ప్రజలు బ్లాక్ మార్కెట్లో ఇండియన్ డ్రగ్స్‌ను కొంటున్నారు. ఇటువంటి సమయంలో చైనా వ్యాక్సిన్‌ల కొరత ఉండడం, అధిక ధరకు విక్రయిస్తుండటంతో.. అక్రమంగా రవాణా చేస్తూ బ్లాక్ మార్కెట్లో తక్కువ ధరకు దొరికే ఇండియన్ డ్రగ్స్ అయిన యాంటీ కొవిడ్‌ ఇండియన్ జనరిక్ డ్రగ్స్ బాక్సును 144 డాలర్లకు అమ్ముతున్నారు.

ఈ విషయం చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫారం అయిన వెయిబోలో ఇది ట్రెండింగ్ అయింది. యూజర్లు మెడిసిన్ పొందడానికి టిప్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్లు రిపోర్టు పేర్కొంది. ఇండియన్ యాంటీ కొవిడ్‌ డ్రగ్స్ అయిన ప్రీమోవిర్, పాక్సిస్ట , మొల్నునట్, మొల్నట్రిస్ తదితర ఔషధాలను చైనీస్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు ఇంకొక ఆన్‌లైన్‌ పోర్టల్ ద్వారా తెలిసింది. లాన్సెట్ కమిషన్ మెంబర్ అయిన సునీల్ గర్గ్ మాట్లాడుతూ.. వైరస్‌కి సరిహద్దులతో సంబంధం లేదని, ఇప్పటికే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని తెలిపారు.

పారాసిటమాల్‌ కొరత

ప్రస్తుతం చైనాలో పారాసిటమాల్‌, ఐబుప్రోఫిన్ టాబ్లెట్లు కొరత ఉండడంతో డిమాండ్ ఎక్కువగా ఉందని, చైనా నుంచి ఈ టాబ్లెట్లు ఉత్పత్తి కోసం కొటేషన్లు వస్తున్నాయని ఫార్మేక్సిల్ చైర్మన్ షాహిల్ ముంజల్ తెలిపారు. ఈ పరిస్థితిపై స్పందించిన ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీస్ స్పోక్స్ పర్సన్ ఆరిందం బాగచి.. ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మెడిసిన్ తయారీదారులుగా ఉన్న ఇండియా ఈ పరిస్థితుల్లో చైనాకి సహాయం చేయడానికి ముందుంటుందని తెలిపారు.

స్పందించని జిన్‌ పింగ్

చైనాలో కరోనా ప్రభావంతో మెడిసిన్‌ షార్టేజ్ రావడంతో జనం ఆస్పత్రుల దగ్గర క్యూకడుతున్నారు. ఆ వీడియోలో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అలాగే శ్మశానం వద్ద శవాలు గుట్టలు కూడా కనిపించాయి. కానీ ఇప్పటివరకు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు గురించి చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ఏం చెప్పలేదు. పెరుగుతున్న కేసుల గురించి స్పందించలేదు.

ఈ పరిస్థితిపై ఏం చేయాలి? అనే దానిపై అధికారులకు ఎటువంటి స్పష్టత లేదని చైనీస్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్యాంగ్ కెచెంగ్ తెలిపారు. మారుమూల ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందినప్పుడు ఒక మేజర్ టెస్ట్ మాత్రం వస్తుందని దానికి కూడా మెడికల్ షార్టేజ్ ఉండవచ్చు అని అన్నారు. ఇల్లీగల్ చానల్ నుంచి లైసెన్స్ లేని వ్యక్తుల నుంచి మెడిసిన్‌లు కొనవద్దని చైనీస్ డాక్టర్లు ప్రజలను వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news