యాక్సిడెంట్ స్పాట్ లో పోలీసులని గుద్దిన డీసీఎం.. ఐదుగురు మృతి

-

సిద్దిపేటలో రెండు రోడ్డు ప్రమాదాలు జరుగగా ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో సీఐ, కానిస్టేబుల్‌ సహా 12 మందికి గాయాలు అయ్యాయి. ముందుగా కారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ సమయంలో పోలీసులు సహాయ చర్యలు చేస్తుండగా మరో ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో గుమిగూడిన జనంపైకి అదే సమయంలో కరీంనగర్ నుండి వస్తున్న డీసీఎం దూసుకు వచ్చింది.

ఈ డీసీఎం ఢీకొని మరో ఇద్దరు మృతి, చెందగా 12 మందికి గాయాలు అయ్యాయి. సిద్దిపేట సీఐ పరశురాం గౌడ్‌, కానిస్టేబుల్‌ అశోక్‌కు గాయాలు అయ్యాయి. మృతులు కారులో ప్రయాణిస్తున్న పెద్దపల్లికి చెందినఅడ్వకేట్ నర్సింహారెడ్డి ఆయన తండ్రి రాజీరేడ్డి, తల్లి విజయ లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదాన్ని చూస్తున్న చిన్నకోడుర్ మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన మల్లేశం, మందపల్లి గ్రామానికి చెందిన ఎల్లారెఢ్డిలు చికిత్స పొందుతూ హస్పటల్ లో మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news