సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రచ్చ రచ్చ.. కుర్చీలతో కొట్టుకున్న కార్యకర్తలు

-

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఏకంగా పరస్పర దాడులు చేసుకునే వరకు పరిస్థితి వచ్చింది. గత కొంత కాలంగా కేసీఆర్ మేనల్లుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు సిరిసిల్ల టికెట్ పై ఆశపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమేష్ రావు, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ చార్జి కే.కే మహేందర్ రెడ్డి మధ్యలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. కాగా, ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నేతల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరారు.

ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కే.కే మహేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం, ముస్తాబాద్ మండలాధ్యక్షుడికి తెలియకుండా ఉమేష్ రావు కొంత మందిని పార్టీలోకి ఆహ్వానించడం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఇరు వర్గాల నేతలు కూర్చీలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో పలువురు పలువురు నేతలకు స్వల్ప గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోయిందని పలువురు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news