మాకేం తెలియదు.. సిట్ విచారణలో మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ కేసు నిందితులు

-

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ కేసులో సిట్ విచారణ రెండో రోజు ముగిసింది. నిన్న రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో ముగ్గురు నిందితులను ప్రశ్నించిన సిట్‌ అధికారులు ఇవాళ కూడా అక్కడే ప్రశ్నించారు. ఇప్పటికే ముగ్గురు నిందితుల నుంచి వాయిస్ రికార్డింగ్స్ సేకరించిన అధికారులు భిన్న కోణాల్లో వారిని విచారించారు. ఈ వ్యవహారంలో నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతి వాంగ్మూలం కీలకం కానుందని సిట్‌ భావిస్తోంది. దిల్లీ నుంచి వచ్చిన ఆయన ఎమ్మెల్యేలతో డబ్బు లావాదేవీలపై మాట్లాడటం, పైలట్‌ రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇప్పిస్తాననడంతో.. ఆ డబ్బును ఎలా సమకూర్చాలనుకున్నారనే అంశానికి ప్రాధాన్యమేర్పడింది.

ఇదే అంశంపై సిట్‌ ఆయన్ను ప్రశ్నించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలతో ఫామ్‌హౌస్‌లో బేరసారాలపై నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నించినప్పుడు చాలా వరకు తమకు తెలియదనే సమాధానం వచ్చినట్టు తెలిసింది. నిందితులను విచారిస్తున్న రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌.. విచారణ జరుగుతున్న తీరును పరిశీలించారు. రెండ్రోజుల సిట్‌ విచారణ ముగిసిన తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఈనెల 25 వరకు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరో వైపు ముగ్గురు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news